Saturday, December 18, 2010

శ్రీ రామ వినయామృతం

' పాడుతా తీయగా ' ద్వారా పాపులరై , సినీ రంగం లో కాలుపెట్టి , వచ్చీనాయమ్మా(మనోహరం) వంటి మంచి మంచి పాటల్ని పాడి , మణిశర్మ వద్ద నాలుగు సంవత్సరాలు మ్యూజిక్ అసిస్టెంట్ గా పని చేసిన పార్థ సారథి (పార్థు) బాలూ గారంత  సంస్కారం వున్న గాయకుడు . శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించిన ఈ పార్థుదు - ఎకబిన  మూడు గంటల  కచ్చేరి ఇవ్వగల సమర్థుడు. నేర్చుకున్న విద్యని పొందిన అనుభవం తో జోడించి దానికి తనలోని సృజనాత్మకత ని జత కలిపి  'జయఘోష ' అనే ఓ ఫ్యూషన్ ఆల్బం కి సంగీతాన్నిచ్చాడు. టైమ్స్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆ ఆల్బం డిసెంబర్ 17 న బాలూ గారి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. పార్థు, శ్రీనిధి , పల్లవి,సాహితి  వీరందరి తో పాటు ఇండియన్ ఐడల్ శ్రీరాం కూడా  ఆ ఆల్బం లో పాడాడు. ఆ ఆల్బం గురించి తర్వాత చెప్తాను. టైమ్స్ మ్యూజిక్ ప్రతినిధి సత్యదేవ్  నాకు ఎప్పట్నుంచో  పరిచయం . ఆర్పీ పట్నాయిక్ , చక్రి వంటి వారు తమ  తొలిరోజుల్లో పరిచయాల్ని పొందింది సత్యదేవ్ ద్వారానే . ఆ సత్యదేవే ఇండియన్ ఐడల్ శ్రీరాం ని నాకు పరిచయం చేసాడు.  నా గురించి విని వుండడం వల్ల శ్రీరాం ఎంతో వినయం గా నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఫోటో  జర్నలిస్ట్ నరసయ్య సహృదయం తో తీసి పంపించిన ఫోటో ఇది . ఫోటో లో కూడా శ్రీరాం వినయం కనబడుతోంది చూడండి. థాంక్స్ టు పార్థు , బాలూ గారు, సత్యదేవ్, శ్రీరాం అండ్ నరసయ్య .      

Friday, December 17, 2010

'సంపూర్ణ గోత్రాలు'

నా రెగ్యులర్ వీడియోల వేట లో గత శనివారం బసంత్ పిక్చర్స్ వారు తీసిన 'సంపూర్ణ రామాయణ' కొన్నాను. వసంత దేశాయ్ మ్యూజిక్. భరత్ వ్యాస్ పాటల్ని రాశారు. అందులో ఓ పాట వింటుంటే మన తెలుగు పాట లో ఓ  లైన్ గుర్తొచ్చింది. హిందీ పాట 'బోలో సభీ జై రాం '. మహేంద్ర కపూర్, బృందం పాడేరు. గుర్తొచ్చిన లైన్ - 'కులగోత్రాలు' సినిమాలోని 'రావే రావే బాలా ' పాటలో 'ఇక్కడ పుట్టిన వాళ్ళం -ఎందుకు మనకీ మేళం' . సరదాగా ఆ రెండు పాటల్లో కామన్ ట్యూన్ తో వున్నాయనిపించిన ఆ లైన్స్ ని ఎడిట్ చేసి ,జాయిన్ చేసి మీ ముందు  ఉంచుతున్నాను. సంపూర్ణ రామాయణ , కులగోత్రాలు టైటిల్స్ ని కలిపి 'సంపూర్ణ గోత్రాలు ' అని హెడ్డింగ్ పెట్టాను. ఇది సరదాకే తప్ప ఎవర్నీకించ పరచడానికి కాదు. వీడియో ని క్లిక్ చేసి ఎంజాయ్ చెయ్యండి.

Monday, December 6, 2010

బాలమురళి గారి గురించి రాసే అదృష్టం - 1

డిసెంబర్ 5 , 2010 న విజయవాడ లో బాలమురళి కృష్ణ గారికి వారి గురువు గారు

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జన్మదినం సందర్భం గా మహోత్కృష్ట సన్మానం
జరిగింది. ఈ సన్మానాన్ని మా టీవీ కవర్ చేసింది . అందుకోసం నన్ను రెండు ఆడియో వీడియో
ప్రజంటేషన్ లు నన్ను రాయమన్నారు . నిజానికి ఆ టైం లో నేను అంత బాగులేను. ఆఫీస్ లో
కొందరి 'చపల వాచాలత్వం' కారణం గా చాలా డిస్టర్బ్ డ్ గా వున్నాను. ఉద్యోగ ధర్మం గా
ఆ సరస్వతీ దేవి మీద భారం వేసి రాయడం మొదలు పెట్టాను. పూర్తి అయ్యాక ఫరవాలేదనిపించింది.
ఎందరో తెలుగు రాని, పలకడం తెలియని ఆర్టిస్ట్ లకు తన వాయిస్ ద్వారా మంచి పేరు తీసుకువచ్చిన
డబ్బింగ్ ఆర్టిస్ట్ , ప్రముఖ గాయని సునీత ఈ ఏవీ లకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చింది . రిహార్సిల్ గా
వీటిని చదువుకుంటూ 'తెలుగు ఎంత చక్కటి భాషో కదా' అంది. ఆ మాటలు నాకు ఎంతో ఉపశమనం గా
అనిపించాయి. 'నువ్వు చెయ్యాల్సింది ఇంకా ఎంతో వుంది ' అని ఆ సరస్వతీ దేవే నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చెయ్యడానికి పరోక్షం గా సునీత ద్వారా చెప్పించిందనిపించింది . ఎడిటర్ వెంకట్ అచ్చి సహకారం తో
తయారు చేసిన ఆ ఏవీ లని మా టీవీ సౌజన్యం తో ఇక్కడ జత పరుస్తున్నాను



బాలమురళి గారి గురించి రాసే అదృష్టం - 2

బాలమురళి గారి మీద నేను చేసిన ఆడియో వీడియో ప్రజంటేషన్ లలో ఇది రెండవది చూసి, జత పరిచిన స్క్రిప్ట్ చూసుకుంటూ మళ్ళీ వినండి. నేనెందుకంత తృప్తి గా ఫీలయ్యానో మీకే తెలుస్తుంది .



Sunday, November 28, 2010

స్పీడ్ గా ఆత్మీయురాలైపోయిన స్పీడ్ సాంగ్ సింగర్



'కొమరం పులి ' సినిమాలో 'సూటిగ సూటిగ ధీటుగ ధీటుగ నాటుకు పోయిన చూపుల కొట్టుడు ' అనే స్పీడ్ సాంగ్ గుర్తుందా ? ఆ పాటని పాడినమ్మాయి పేరు శ్వేతా మోహన్. మోహన్ అన్నది వాళ్ళ నాన్నగారు కృష్ణ మోహన్ నుంచి వచ్చినది. ప్రముఖ గాయని సుజాత కూతురీమె.చెప్పవే చిరుగాలి (ఒక్కడు) ఆబ్బబ్భా ఇద్దూ (చూడాలని వుంది,చెప్పనా ప్రేమా(మనసంతా నువ్వే)పాటలు గుర్తున్నవాళ్ళకి సుజాత గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్వేత కూడా చాలా మంచి గాయని.ఖలేజా లో పిలిచే పెదవుల పైనా,రోబో లో',చిట్టి చిట్టి రోబో-బూం బూం రోబోరా', సిద్దూ ఫ్రం శ్రీకాకుళం లో 'న నా బాబ నా'వంటి కఠినమైన,మంచి మంచి పాటలున్నయ్ ఆమె క్రెడిట్ లో. 'పులి 'లోని స్పీడ్ సాంగ్ వినగానే ఆమె ని కాంటాక్ట్ చేసి తన గురించి తెలుసుకుని అదంతా ఐడిల్ బ్రెయిన్.కాం లో 'ఎ సాంగ్ టు రిమెంబర్ ' అనే శీర్షిక లో ఆమె గురించి రాశాను. ఆ రిలేషన్ ని మనసులో పెట్టుకుని హైద్రాబాద్ లో ఓ షో ఇవ్వడానికి వచ్చినప్పుడు నన్ను కలిసింది. ఆ సందర్భంగా ఆమె కి ఈనాడు,సాక్షి పేపర్లలో, మా టీవీలో ఇంటర్వ్యూలు చేయించాను. అతి తక్కువ టైంలోనే ఆత్మీయురాలై పోయింది. ఆ సందర్భంగా తీయించుకున్న ఫొటోలే ఇవి.

Friday, November 26, 2010

గుండె చెమ్మగిల్లిన వేళ ....


దిగువన ఇదే హెడ్డింగ్ తో కొన్ని ఫీలింగ్స్ నిరాసి పేపర్ క్లిప్పింగ్స్ ని జత పరిచాను. అవి మొదట చదువుకుని తరవాత ఇది చదువుకుంటే బావుంటుంది . ఆ సీక్వెన్స్ లోనే రెండు వారాల పాటు ఈ అభిప్రాయాలు ప్రచురించ బడ్డాయి కూడా . మీరు కూడా అలాగే చదువుకోండి.. ప్లీజ్ ...

గుండె చెమ్మగిల్లిన వేళ ...


జర్నలిస్ట్ మిత్రుడు ప్రభు ఇటీవల కొంతమంది (సినీ) ప్రముఖుల నుంచి నా పై వారికి గల అభిప్రాయాల్ని సేకరించాడు. అవి ట్రేడ్ గైడ్ అనే పత్రిక లో ప్రచురించ బడ్డాయి. ఆ పత్రిక మార్కెట్ లో దొరకదు. సినీ పరిశ్రమలో మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఆ అభిప్రాయాల్ని చదువుతూ వుంటే నా పై వారికి గల అభిమానానికి గుండె చెమ్మగిల్లి పోయింది. ఆ అభిమానాల్ని, అభిప్రాయాల్ని అలాగే నిలబెట్టుకోవాలని వుంది. ఈ సందర్భంగా ప్రభుకి ప్రత్యేక కృతజ్ఞతలు . ఇంకో మూడు అభిప్రాయాలు వున్నాయి. అవి నెక్స్ట్ పోస్టింగ్ లో ...

Tuesday, November 23, 2010

వైజయంతీ మాల ' స్టిల్ గ్రేట్ '


ఆ మధ్య చెన్నై వెళ్లి నప్పుడు అలనాటి అందాల నటి వైజయంతీమాలని కలవడం జరిగింది . అది కూడా అక్కినేని నాగేశ్వర రావు గారి ద్వారానే సాధ్యమయింది .ఆయన చెబితేనే ఆవిడ అప్పాయింట్ మెంట్ దొరికింది. చాలా పెద్ద ఇల్లు ఆవిడది . ఒక మంత్రి గారి ఇంట్లోకి వెళుతున్నట్టు అనిపించింది. ఇప్పటికీ ఆవిడ డాన్స్ ప్రోగ్రాం లు ఇస్తోందట . చాలా కలుపుగోలుగా మాట్లాడింది. ఆ సందర్బం గా తీయించుకున్న ఫోటోలే ఇవి. ఈ ఫోటోలు కూడా ఎలా తియ్యాలో , లైటింగ్ ఎలా ఉండాలో అన్నీ చెప్పి మరీ తీయించారు ఆవిడ.

Monday, November 22, 2010

తనికెళ్ళ భరణి వెండి పండగ




తనికెళ్ల భరణి తన సినీ జీవిత రజతోత్సవాన్ని పురస్కరించుకొని చేసుకున్న 'వెండి పండగ ' కి మా టీవీ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. భరణికి, నాకు వున్న స్నేహం ఇప్పటిది కాదు. దాదాపు ముప్పైయేళ్ళ క్రితంది.అతను చల్ చల్ గుర్రం నాటిక రాసిన కొత్తలో వంశీ ఆర్ట్స్ తఫున అతనితో ప్రదర్శింప చేశాను.ఆ తర్వాత అతను మెద్రాస్ వెళ్ళిపోయాడు. నేను తరంగిణి పత్రికకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వున్నప్పుడు ఓ ఫీచర్ రాయించాను.స్క్రీన్ ప్లే గ్రౌండ్ ఆ ఫీచర్ పెరు. నేను ఏ పత్రికకి మారినా భరణి ఏదో ఒకటి రాయాల్సిందే. వార్త సినిమా పేజీ కి ఇన్ చార్జ్ గా వున్నప్పుడు భరణి తో రాయించిన కొన్ని వ్యాసాలు 'నక్షత్ర దర్శనం ' పుస్తకం లో కనిపిస్తాయి. హాసం పత్రికకి ఎడిటర్ గా వున్నప్పుడు సంగీత కళాకారులపై రాయించిన వ్యాసాలు ఎందరో మహానుభావులు పుస్తకం గా వచ్చాయి. ఈ అనుబంధాన్ని పురస్కరించుకుని ఆయన వెండి పండగ నాడు ఆయనకి స్వర్ణ కంకణాన్ని తొడిగే అవకాశం నాకు మా టీవీ ద్వారా లభించింది. ఆ సందర్భం గా తీసిన ఫోటో ఇది. అప్పుడె బాలకృష్ణ ద్వారా మా టీవీ తరఫున మొమెంటొ అందుకున్నాను.ఈ జీవితానికి మరొక మంచి జ్ఞాపకం. నవంబర్ పదిహేడవ తేదీన జరిగిన ఈ ఫంక్షన్ ని మా టీవీ ఇరవై ఒకటో తేదీన ప్రసారం చేసింది. వారి సౌజన్యం తో కొన్ని వీడియో పార్ట్ లని కూడా జత పరుస్తున్నాను . చూడండి .

Monday, July 26, 2010

మా టీవీ తో మరో మధురానుభూతి

ఈ నెల (జూలై ) ఇరవై నాలుగున మా టీవీ యాజమాన్యం ' మా డే సెలబ్రేషన్స్ ' ని నిర్వహించింది . అవి ఎంత గొప్ప గా ఉన్నాయంటే ఒక్కొక్క ఐటెం గురించి ఐదేసి నిముషాల పాటు ప్రత్యేకం గా చెప్పొచ్చు . మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు , అల్లు అరవింద్ గారు , చలసాని రమేష్ గారు , నాగార్జున గారు , సి. రామకృష్ణ గారు , శరత్ మరార్ గారు వీరి ఆధ్వర్యం లో , మా టీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ గారి నేతృత్వం లో జరిగిన ఆరోజు జరిగిన కార్యక్రమాలలో నా గురించి కూడా ఓ క్లిప్పింగ్ ని ప్రదర్శించడం నా జీవితానికి మిగిలిన మరో మంచి అనుభూతి . ఈ క్లిప్పింగ్ ని మా టీవీ లోని సీనియర్ మానేజర్ విక్టర్ షూట్ చేయగా , వరప్రసాద్ ఎడిట్ చేసారు . వీరందరికీ నా కృతఙ్ఞతలు . జత పరిచిన క్లిప్పింగ్ చూసి నాతో పాటు మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తూ ...

Monday, July 19, 2010

మా టీవీ మిగిల్చిన అద్భుత జ్ఞాపకాలు ...






















మా టీవీ నిర్వహించిన సూపర్ సింగర్స్ ఐదవ విభాగం ఫైనల్స్ నాకెన్నో మంచి మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. కార్యక్రమం ద్వారా సినీ సంగీత ప్రపంచం లోని ప్రముఖుల్ని మరోసారి కలిసే అదృష్టం కలిగింది . వర్ధమాన గాయనీ గాయకులతో ముచ్చటించే అవకాశం వచ్చింది . సినీ సంగీతానికి సంబంధించి నాలోని ప్రతీ కణం - ప్రతీ క్షణం రగిల్చే
తపనకు ఆ ప్రోగ్రాం షూటింగ్ జరిగిన రెండు రోజులూ స్వాంతన లభించింది . మా టీవీ ప్రోగ్రామింగ్ డిపార్ట్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సాయి ప్రసాద్ నాకు కొన్నిబాధ్యతలను అప్ప చెప్పారు . అక్కినేని నాగేశ్వర రావు , మణిశర్మ లను ఆ కార్యక్రమానికి గెస్ట్ లు గా పిలవడం ఆ బాధ్యతల్లో ఓ భాగమే అయినా అది ఓ ఘనత గా నా ఎకౌంటు లో పడిపోయింది . అలాగే ఆ ఫైనల్స్ లో కీరవాణి గారి పక్కన కూర్చోవడం కూడా . ఆ ప్రముఖులతో నాకున్న పరిచయాలు వేరు . వారితో టీవీ లో కనిపించడం వేరు . ఆ ఘనతల వెనక నా కున్న అర్హతల మాటెలా వున్నా , వాటిని ఆ సమయంలో గుర్తించింది మాత్రం సాయి ప్రసాద్ గారే . మణిశర్మ తో నేను వున్న ఫోటోలలో ఆ పక్కనే ఎల్లో షార్ట్ లో ఫ్రెంచ్ బియర్డ్ తో వున్నది ఆయనే .. ఈ సందర్భం గా శ్రీ సాయి ప్రసాద్ గారికి నా కృతఙ్ఞతలు .

భవిష్యత్ లో చెప్పుకోడానికి గొప్ప గా ...


మా టీవీ నిర్వహించిన 'సూపర్ సింగర్స్ ' కార్యక్రమం గురించి మీ అందరికీ తెలిసే వుంటుంది . ఆ సీరీస్ లోని ఐదవ విభాగం లో నేను పాలు పంచుకునే అవకాశం వచ్చింది . ఈ ఫోటో ఆ ప్రోగ్రాం ఫైనల్స్ లో తీసినది . నా పక్కన వున్నది - శ్రీనిధి , అంజనా సౌమ్య , ప్రణవి . ముగ్గురూ మంచి గుర్తింపు ని పొందిన సింగర్ లే . ఈ ఫోటోని చూసుకుంటూ నేను మురిసిపోతూ , గొప్పగా చెప్పుకోదగ్గ స్టాయికి చేరే అర్హత ఈ ముగ్గురికీ వుంది . అంతే కాదు ప్రతిభను మించిన వినయ సంపద ముగ్గురిలోనూ వుంది . అదే వాళ్ళను పైకి తీసుకు వస్తుంది , కాపాడుతుంది కూడా . ఈ ఫోటో ని నాకు ఇస్తూ " మీ అమ్మాయిలా సార్ ? " అని అడిగారు - వాళ్ళతో ముఖ పరిచయం లేని వాళ్ళు . ఒక విధం గా అది కరక్టే . నిజానికి నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ అద్భుతంగా కాకపోయినా , బాగా పాడతారు . సింగింగ్ ని ప్రొఫెషన్ గా తీసుకోక పోవడం వల్ల అద్భుతం గా పాడే స్థాయి వాళ్లకి రాలేదు . ' ఒక విధం గా అది కరక్టే ' అని ఎందుకన్నానంటే - బాగా పాడుతూ ఆ వయసులో వున్న ఏ సింగర్ ని చూసినా నాకు నా కూతుళ్ళని చూసినట్టే వుంటుంది . వాళ్ళతో మాట్లాడుతూ వుంటే నాకు నా పిల్లలతో మాట్లాడినట్టే వుంటుంది . సూపర్ సింగర్ ద్వారా అందరికీ బాగా తెలిసిన శ్రావణ భార్గవి ఆంటే నాకు మరీ మరీ ఇష్టం . "మా ఇంటికి రామ్మా " అని మనసారా పిలిచాను కూడా . ఆ అమ్మాయి తో ఫోటో తీయించుకునే రోజు ఎప్పుడొస్తుందో ఏమో ... ఆ అమ్మాయి కి కూడా సింగర్ గా చాలా మంచి భవిష్యత్ వుందని నా నమ్మకం .

Thursday, July 15, 2010

ప్రకృతి ధర్మం


గుండెల్లో బడబాగ్నిని దాచుకుంటే

బైటికుబికే నీరు

ఉప్పగానే వుంటుంది

అది మనిషైనా సరే

సముద్రమైనా సరే ... !!

Saturday, July 3, 2010

అనుభవైకవేద్యం


బిడ్డకు తల్లి స్పర్శ

భార్యకు భర్త స్పర్శ

కవికి రస స్పర్శ

ఒకరు బోధించేవి కావు

Wednesday, June 16, 2010

అంతర్గాంధారం


గాంధారరాజు వెన్నెముక

శకుని మావ మేధస్సు

కలిస్తేనే గాని

కౌరవులను పతనం చేసే పాచికలు పుట్టలేదు

దేన్నిపడగొట్టడానికైనా

ఈ రెండూ కావాలి నాయనా !

ఐతే , వెన్నెముకకు ఆకలి చావు

మేధస్సుకు గులాం బతుకు తప్పని సరి .

Tuesday, June 15, 2010

స్థల పురాణం




కళ్ళకద్దుకొని
దేవుడిక్కొట్టే
కొబ్బరికాయ స్థానం
ఒలుస్తున్నప్పుడు
అరికాళ్ళ సందునే

Monday, June 14, 2010

వండు 'కో -యిలా'




చెప్పిన పలుకులు పలుకుతుంది చిలక
గుండెల్లోంచి వచ్చింది కూస్తుంది కోయిల
అయినా చిలకనే డ్రాయింగ్ రూం లోకి తెచ్చుకుంటాం
కోయిలని మాత్రం వండుకు తిని మెచ్చుకుంటాం
మన మాటలకి తాళం వేసే వాడినే ఆదరిస్తాం
స్వంతంగా ఆలోచించే వాడిని మాత్రం ఆరగిస్తాం

(ఒకప్పటి పాత్రికేయ మిత్రుడు, ఇప్పటి సినీ కవి మిత్రుడు భాస్కరభట్ల రవికుమార్ 'భాస్కరభట్లలిరిక్స్.బ్లాగ్ స్పాట్.కం' ఓపెన్ చేశాను చూడండి అంటూ మెస్సేజ్ పెట్టాడు.తన సినిమా పాటల్లోని విషయాలే రాస్తాడనుకున్నాను. కానీ చాలా మంచి కవిత్వం రాశాడు. సినిమా పరిశ్రమ లో వుంటున్నాడు కనుక మంచి మంచి విజ్షువల్ ఎఫెక్ట్స్ జత చేశాడు. ఆ కవితలు , ఆ బొమ్మలు చూశాక ముప్పై ఏళ్ళ క్రితం నేను రాసుకున్న కవితలు గుర్తుకొచ్చాయి . వాటిని ఎందుకు బ్లాగు మిత్రులతో పంచుకోకూడదు అని అనిపించింది. థాంక్స్ టు భాస్కరభట్ల) .

Tuesday, June 1, 2010

వేటూరి పాటలకు పెద్ద పీట వేసిన గుణశేఖర్




తపన,కఠోర పరిశ్రమ,లేటెస్ట్ టెక్నాలజీ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వుండడం ఇవన్నీ కళా రంగం లో మనుగడ సాగించాలనుకునే వారికి తప్పనిసరి. ఈ గుణాలన్నిటికీ తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకులలో గుణశేఖర్ ఓ మంచి ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. మే 31న ఉద్యోగ రీత్యా ఆయన్ని కలవడం జరిగింది. వేటూరి గారి మీద ఓ గంట సేపు అనర్గళం గా మాట్లాడారాయన. వేటూరి గారి తో అద్భుతమైన పాటలు రాయించిన దర్శకుడు గుణశేఖర్. ఆయన తీసిన 'మనోహరం' సినిమాలోని ఓ పాటలో 'పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ ఇసుకల్లో ' అంటూ వెన్నెల గురించి వేటూరి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఎవరు మరిచిపోగలరు ? కలకత్తా గురించి 'యమహా నగరి ' ని మించిన పాట ఉందా ? పెళ్లి పాటల్లో ఐదు రోజుల పెళ్లి పాట నిలిచిపోయే పాట కాదా ? ఆ పాటలకు సంబంధించిన అనుభవాలు ఆయన చెబుతూ వుంటే టైమే తెలియలేదు. నా గుండెల్లో కలకాలం నిలిచిపోయేటన్ని అనుభవాలు చెప్పేరాయన. జూన్ 2వ తేదీ గుణశేఖర్ బర్త్ డే . అందుకని ఈ రెండిటినీ కలుపుకుని మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆయనకీ . పాటల గురించి ఎంతో చెప్పిన ఆ అనుభవాలకీ .

Sunday, May 30, 2010

ఇద్దరు మిత్రులు





సినీ పరిశ్రమలో ఏ భేషజం, కల్మషం లేని మిత్రులు దొరకడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. అదృష్టం కొద్దీ కోటి,చంద్రబోస్ ఇద్దరూ నాకున్న అటువంటి మిత్రులే. అందుకే మే 28న కోటి బర్త్ డే ని పురస్కరించుకుని ఆయన్ని అభినందించడానికి వెళ్ళాను. లక్కీ గా చంద్రబోస్ కూడా అక్కడుండడం నాకు మరీ కలిసొచ్చింది. చాలా కాలం తర్వాత ముగ్గురం కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కోటి తన గురువయిన చక్రవర్తి గారిని చాలా సేపు తలచుకున్నారు. చంద్రబోస్ ఈ బ్లాగు రెగ్యులర్ గా చూస్తున్నారు. ఈ బ్లాగులో విషయాలు మాట్లాడారయన. ముఖ్యంగా గురవారెడ్డి గారి హాస్పిటల్ గురించి,నేను పెట్టిన టైటిల్ గురించి మెచ్చుకుంటూ మాట్లాడారయన.ఎంతో తృప్తి గా గడిచిన రోజుల్లో ఆ రోజొకటి.

Thursday, May 13, 2010

సజ్జనుడే సర్జనుడైతే ....


















ప్రముఖ వైద్యులు డాక్టర్ గురవా రెడ్డి సికిందరాబాద్ లోని ప్యారడైస్ సర్కిల్ దగ్గిర ఇటీవల సన్ షైన్ హాస్పిటల్స్ ని ప్రారంభించారు. కొంతమంది స్నేహితుల తో కలిసి అత్యధిక వ్యయ ప్రయాసలకోర్చి , తను సంపాదించుకున్నదంతా కుమ్మరించీ గురవా రెడ్డి గారు నిర్మించుకున్న హాస్పిటల్ ఇది. ఈ ప్రారంభోత్సవానికి సినీ, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులతో పాటు ఎందరెందరో శ్రేయోభిలాషులు వచ్చి గురవారెడ్డి గారికి అభినందనలు తెలిపారు . పత్రికలూ , టీవీ చానల్సూ బ్రహ్మాండం గా కవర్ చేసాయి . ఒకరకంగా గురవారెడ్డి గారు సంపాదించుకున్న గుడ్ విల్ ఎంతుందో ఆరోజే చాలా మందికి తెలిసింది. లేటెస్ట్ ఎక్విప్ మెంట్ తో పాటు ప్రతీవారిని ఆకట్టుకునే అంశాలు ఓ రెండున్నాయి. 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు ఓ డాక్టర్ తో ' ఫస్ట్ ఎయిడె మాన్డేట్రీ ' అంటూ అనిపించే సీన్ గుర్తుండే వుంటుంది . అలా సెల్లార్ లో ఓ ఎమర్జెన్సీ వార్డ్ ని ఏర్పాటు చేసారు. ఎమర్జెన్సీ కేసులు ఇక్కడ డైరెక్ట్ గా ఎడ్మిట్ అవుతాయి . అందుకు సంబంధించిన వెహికిల్ డైరెక్ట్ గా సెల్లార్ లోకి వచ్చెయ్య వచ్చు. ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండా అడ్మిట్ చేసుకుంటారు. మెడికో లీగల్ కేసులైనా సరే పేషెంట్ ని కాపాడిన తర్వాతే ఫార్మాలిటీస్ . ఈ సెల్లార్ లో సీటీ స్కానింగ్ , ఎమ్మారై ఎక్విప్ మెంట్ తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా వుంది. ఇవన్నీ జత పరిచిన ఫోటోలలో చూడవచ్చు. ఇక మిగిలిన ఫ్లోర్ లలో కార్పోరేట్ హాస్పిటల్స్ లో వుండే వన్నీ వున్నాయి. సాధారణంగా కార్పోరేట్ హాస్పిటల్స్ మధ్య తరగతి వారికి అందుబాటులో వుండవు అనే అభిప్రాయాన్ని దూరం చేయడానికే అన్నట్టు గురవా రెడ్డి గారు ఓ స్కీం ని పెట్టారు. దాని పేరు సేఫ్ కార్డ్. సేఫ్ లోని ఎస్ ఏ ఎఫ్ యి కి 'సన్ షైన్ ఆక్సిడెంట్ పాలసీ ఫర్ ఎమర్జెన్సీస్ ' అంటూ తనలోని కవితాత్మను కూడా ప్రదర్శించారు గురవారెడ్డి. సంవత్సరానికి మూడు వందలు కట్టి ఈ కార్డ్ ని స్వంతం చేసుకో వచ్చు. ఆక్సిడెంట్ లు అయినప్పుడు అవుట్ పేషంట్ గా అయితే వెయ్యి రూపాయిల వరకు మందులనీ , ఇన్ పేషంట్ గా అయితే లక్ష రూపాయల వరకు ట్రీట్ మెంట్ నీ తీసుకోవచ్చు. సంగీతానికి సంబంధించిన విషయాలు రాసే రాజా ఈ హాస్పిటల్ గురించి ఎందుకు చెప్తున్నాడా అనే సందేహం కలగొచ్చు. గురవారెడ్డి గారు గొప్ప సంగీత సాహిత్య ప్రియుడు. ఆయన కత్తులు కటార్ల తో వైద్యం చెయ్యరు మంచి మాటలతో నయం చేస్తారు అని అక్కినేని నాగేశ్వరరావు గారితో , ముళ్ళపూడి వెంకట రమణ గారితో అనిపించుకున్న సర్జనుడు -సజ్జనుడు . 'నవ్య ' మ్యాగజిన్ లో కొన్ని వారాల పాటు మంచి మంచి వ్యాసాలు రాసి తనలోని సంగీత సాహిత్యాభిలాష నీ, అభిరుచి నీ చాటుకున్నరస హృదయుడు - సరస హృదయుడు . అటువంటి వ్యక్తీ నుండి పర్సనల్ గా ఆహ్వానం అందుకోవడం , వెళితే నన్ను సంగీతానికి సంబంధించిన వ్యక్తీ గా ఆయన అప్యాయం గా రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ నన్ను ఎంత గానో కదిలించాయి . ముఖ్యం గా ఫార్మాలిటీస్ కన్నా పేషెంట్ బ్రతకడం ఇంపార్టెంట్ అనే ఆయన సిద్ధాంతం నన్ను బాగా ఆకర్షించింది . ఆ సమయం లోనే నా మనసులో ఓ ఆలోచన స్ఫురించింది . అది గనుక ఫలిస్తే ' రాగానికి రోగానికి ముడి పెట్టె ఓ ప్రాజెక్ట్ ' గా రూపు దిద్దు కునే అవకాశం వుంది. అందుకు స్ఫూర్తి నిచ్చిన గురవారెడ్డి గారికి కృతజ్ఞతలు .

Monday, May 10, 2010

శ్రీ శ్రీ కి నివాళి గా ...

శ్రీ శ్రీ శతజయంతి సందర్భంగా ఏప్రిల్ ముప్పై న హైదరాబాద్ జూబిలీ హాల్ లో ఓ పెద్ద ఫంక్షన్ జరిగింది. బెంగుళూరు లో ఉంటున్న రాయుడు గారు, విశాఖపట్నం లో ఉంటున్న చలసాని ప్రసాద్ గారు కలిసి శ్రీ శ్రీ వర్క్స్ అన్నిటినీ మూడు పుస్తకాలు గా 'శ్రీ శ్రీ ప్రస్తాన త్రయం ' పేరుతో ప్రింట్ చేయించారు. ఆ పుస్తకాల ఆవిష్కరణ ఆ రోజు ఉదయం జరిగింది . ఎందరెందరో ' గొప్ప గొప్ప' అభిమానులు వచ్చారా సభ కి. నిజంగా ఆ పుస్తకాలు ప్రింట్ చేయించి తిరుగులేని సాహితీ సేవ చేసారు రాయుడు గారు , చలసాని ప్రసాద్ గారు. భవిష్యత్ తరాలకు నిలిచిపోయే సేవ ఇది. ప్రముఖ రచయిత్రి శ్రీమతి మృణాళిని అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన సెమినార్ లో శ్రీ శ్రీ గురించి ఎందరో మేధావులు ప్రసంగించారు . ఇక సాయంత్రం జరిగిన సంగీత కార్యక్రమం లో ఒక చోట నేను వేదిక మీదికి వెళ్లక తప్పలేదు. అది ఎందుకో , అక్కడ నేను ఏం మాట్లాడానో జత పరిచిన వీడియో క్లిక్ చేసి చూడండి . అర్ధమైపోతుంది ...

Monday, May 3, 2010

బుల్లితెర పై విశ్వనాథ్ గారి పక్కన ... పూర్వ జన్మ సుకృతం ..

ఎన్ టీవీ వారికి భక్తీ టీవీ , వనితా టీవీ వున్నాయి. శంకరాభరణం రిలీజై ముప్పై ఏళ్ళు ఐన సందర్భంగా ఓ కార్యక్రమాన్ని చెయ్యాలనుకున్నారు వనితా టీవీ వారు. సంధానకర్త గా ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు గారిని పిలిచారు. ఇక నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు , దర్శకుడు కె. విశ్వనాథ్ గారు లేకుండా కార్యక్రమమే లేదు కనుక వారిని పిలిచారు. వీరందరితో పాటు నన్ను కూడా పిలవడమే ఆశ్చర్యం , ఆనందం కూడా. లిస్ట్ లో నా పేరు చూసి ' కరెక్ట్ పర్సన్ ని పిలిచారు' అని అన్నారట విశ్వనాథ్ గారు. అది ఇంకా ఆనందం ... ఓ విధంగా అవార్డ్ లాంటిది కూడా. ఇదిలా వుండగా ఈ ప్రోగ్రాం లో నేను పాల్గొనడానికి నేను పని చేస్తున్న మా టీవీ వారు పర్మిషన్ ఇవ్వడం వారు నాకిచ్చే గౌరవానికి ఓ ఉదాహరణ . ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ప్రసారమైన ఆ 'మూడు పదుల శంకరాభరణం ' కార్యక్రమం కి వనితా టీవీ వారు ఇచ్చిన ప్రోమో ని దిగువన జత పరుస్తున్నాను . (షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో ని శోభా నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ పంపారు).

మూడు పదుల శంకరాభరణం గురించి ...

పైన చెప్పిన కార్యక్రమం నిడివి సుమారు నలభై నిముషాలు. బ్లాగు లో అంత కార్యక్రమాన్ని పెట్టలేం. పైగా నేరం కూడా. అంచేత నేను మాట్లాడిన భాగం లో కొంత భాగాన్ని జత పరుస్తున్నాను .