Saturday, December 18, 2010

శ్రీ రామ వినయామృతం

' పాడుతా తీయగా ' ద్వారా పాపులరై , సినీ రంగం లో కాలుపెట్టి , వచ్చీనాయమ్మా(మనోహరం) వంటి మంచి మంచి పాటల్ని పాడి , మణిశర్మ వద్ద నాలుగు సంవత్సరాలు మ్యూజిక్ అసిస్టెంట్ గా పని చేసిన పార్థ సారథి (పార్థు) బాలూ గారంత  సంస్కారం వున్న గాయకుడు . శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించిన ఈ పార్థుదు - ఎకబిన  మూడు గంటల  కచ్చేరి ఇవ్వగల సమర్థుడు. నేర్చుకున్న విద్యని పొందిన అనుభవం తో జోడించి దానికి తనలోని సృజనాత్మకత ని జత కలిపి  'జయఘోష ' అనే ఓ ఫ్యూషన్ ఆల్బం కి సంగీతాన్నిచ్చాడు. టైమ్స్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆ ఆల్బం డిసెంబర్ 17 న బాలూ గారి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. పార్థు, శ్రీనిధి , పల్లవి,సాహితి  వీరందరి తో పాటు ఇండియన్ ఐడల్ శ్రీరాం కూడా  ఆ ఆల్బం లో పాడాడు. ఆ ఆల్బం గురించి తర్వాత చెప్తాను. టైమ్స్ మ్యూజిక్ ప్రతినిధి సత్యదేవ్  నాకు ఎప్పట్నుంచో  పరిచయం . ఆర్పీ పట్నాయిక్ , చక్రి వంటి వారు తమ  తొలిరోజుల్లో పరిచయాల్ని పొందింది సత్యదేవ్ ద్వారానే . ఆ సత్యదేవే ఇండియన్ ఐడల్ శ్రీరాం ని నాకు పరిచయం చేసాడు.  నా గురించి విని వుండడం వల్ల శ్రీరాం ఎంతో వినయం గా నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఫోటో  జర్నలిస్ట్ నరసయ్య సహృదయం తో తీసి పంపించిన ఫోటో ఇది . ఫోటో లో కూడా శ్రీరాం వినయం కనబడుతోంది చూడండి. థాంక్స్ టు పార్థు , బాలూ గారు, సత్యదేవ్, శ్రీరాం అండ్ నరసయ్య .      

Friday, December 17, 2010

'సంపూర్ణ గోత్రాలు'

నా రెగ్యులర్ వీడియోల వేట లో గత శనివారం బసంత్ పిక్చర్స్ వారు తీసిన 'సంపూర్ణ రామాయణ' కొన్నాను. వసంత దేశాయ్ మ్యూజిక్. భరత్ వ్యాస్ పాటల్ని రాశారు. అందులో ఓ పాట వింటుంటే మన తెలుగు పాట లో ఓ  లైన్ గుర్తొచ్చింది. హిందీ పాట 'బోలో సభీ జై రాం '. మహేంద్ర కపూర్, బృందం పాడేరు. గుర్తొచ్చిన లైన్ - 'కులగోత్రాలు' సినిమాలోని 'రావే రావే బాలా ' పాటలో 'ఇక్కడ పుట్టిన వాళ్ళం -ఎందుకు మనకీ మేళం' . సరదాగా ఆ రెండు పాటల్లో కామన్ ట్యూన్ తో వున్నాయనిపించిన ఆ లైన్స్ ని ఎడిట్ చేసి ,జాయిన్ చేసి మీ ముందు  ఉంచుతున్నాను. సంపూర్ణ రామాయణ , కులగోత్రాలు టైటిల్స్ ని కలిపి 'సంపూర్ణ గోత్రాలు ' అని హెడ్డింగ్ పెట్టాను. ఇది సరదాకే తప్ప ఎవర్నీకించ పరచడానికి కాదు. వీడియో ని క్లిక్ చేసి ఎంజాయ్ చెయ్యండి.

Monday, December 6, 2010

బాలమురళి గారి గురించి రాసే అదృష్టం - 1

డిసెంబర్ 5 , 2010 న విజయవాడ లో బాలమురళి కృష్ణ గారికి వారి గురువు గారు

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జన్మదినం సందర్భం గా మహోత్కృష్ట సన్మానం
జరిగింది. ఈ సన్మానాన్ని మా టీవీ కవర్ చేసింది . అందుకోసం నన్ను రెండు ఆడియో వీడియో
ప్రజంటేషన్ లు నన్ను రాయమన్నారు . నిజానికి ఆ టైం లో నేను అంత బాగులేను. ఆఫీస్ లో
కొందరి 'చపల వాచాలత్వం' కారణం గా చాలా డిస్టర్బ్ డ్ గా వున్నాను. ఉద్యోగ ధర్మం గా
ఆ సరస్వతీ దేవి మీద భారం వేసి రాయడం మొదలు పెట్టాను. పూర్తి అయ్యాక ఫరవాలేదనిపించింది.
ఎందరో తెలుగు రాని, పలకడం తెలియని ఆర్టిస్ట్ లకు తన వాయిస్ ద్వారా మంచి పేరు తీసుకువచ్చిన
డబ్బింగ్ ఆర్టిస్ట్ , ప్రముఖ గాయని సునీత ఈ ఏవీ లకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చింది . రిహార్సిల్ గా
వీటిని చదువుకుంటూ 'తెలుగు ఎంత చక్కటి భాషో కదా' అంది. ఆ మాటలు నాకు ఎంతో ఉపశమనం గా
అనిపించాయి. 'నువ్వు చెయ్యాల్సింది ఇంకా ఎంతో వుంది ' అని ఆ సరస్వతీ దేవే నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చెయ్యడానికి పరోక్షం గా సునీత ద్వారా చెప్పించిందనిపించింది . ఎడిటర్ వెంకట్ అచ్చి సహకారం తో
తయారు చేసిన ఆ ఏవీ లని మా టీవీ సౌజన్యం తో ఇక్కడ జత పరుస్తున్నాను



బాలమురళి గారి గురించి రాసే అదృష్టం - 2

బాలమురళి గారి మీద నేను చేసిన ఆడియో వీడియో ప్రజంటేషన్ లలో ఇది రెండవది చూసి, జత పరిచిన స్క్రిప్ట్ చూసుకుంటూ మళ్ళీ వినండి. నేనెందుకంత తృప్తి గా ఫీలయ్యానో మీకే తెలుస్తుంది .