Sunday, May 31, 2009

దేవిశ్రీ 'కరెంట్ ' రిలీజైంది



దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిచ్చిన 'కరెంట్' ఆడియో రిలీజైంది. అక్కినేని మనవడు , నాగార్జున మేనల్లుడు ఐన సుశాంత్ సినిమా లో హీరో. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో లో ఐదు పాటలున్నాయి.(గోపి గోపిక గోదావరి ఆడియో నుంచి ఐదు పాటల ట్రెండ్ మొదలైనట్టుంది). కరెంట్ ఆడియో లోని ఐదు పాటలలో రెండిటిని భాస్కరభట్ల రాశారు. మిగిలిన మూడిటిని రామ జోగయ్య శాస్త్రి రాశారు. మొదటి పాట యూ వర్ మై లవ్ లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని దేవిశ్రీ ప్రసాద్ రాశారు . డి యస్ పి అని వుంటుంది. మూడవ పాట అమ్మాయిలు అబ్బాయిలు పాట లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని (అందరి వాడు పాట పాడిన) ఆండ్రియా రాశారు. నాల్గవ పాట కరెంట్ టైటిల్ సాంగ్ లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని దివ్య ,రెనిన కలిసి రాశారు. దివ్య ఇదివరకు 'రెడీ' లో ఓం నమస్తే బోలో పాటని పాడింది. రెనిన ఆడియో లోనే 'రెక్కలు తొడిగిన పక్షల్లే ' పాటని పాడింది. ఇందులోని పాటల గురించి తర్వాత చర్చించుకుందాం .

No comments: