Tuesday, September 10, 2013

జేసుదాసు తర్వాత మధుబాలకృష్ణనే




సరిగ్గా 12 ఏళ్ళ క్రితం విన్నాను - మధుబాలకృష్ణన్ వాయిస్. రామజోగయ్య శాస్త్రి గారు సినీ గీత రచయిత కాక ముందు తను రాసిన కొన్ని పాటలను వినమంటూ ఓ క్యాసెట్ ఇచ్చారు. సాహిత్యం ఎంత బావుందో పాడిన గొంతు అంత బావుంది. 'ఎవరిదండీ ఈ వాయిస్ ?' అనడిగాను. 'మధు బాలకృష్ణన్ అని మలయాళ గాయకుడు' అని చెప్పారు రామజోగయ్య శాస్త్రి. అచ్చు జేసుదాసు గారి ని గుర్తు చేసే ఆ వాయిస్ మీద ప్రేమ పెంచుకున్నాను. ఎప్పుడు మనవాళ్ళు పాడిస్తారా అని ఎదురు చూశాను. ఈలోగా చంద్రముఖి తమిళ వెర్షన్ లో 'కొంజుమ్ నేరమ్ కొంజుమ్ నేరమ్' పాట ఆశాభోస్లే తో పాడగా ఆ వాయిస్ ని విన్నాను. తర్వాత చంద్రముఖి తెలుగు వెర్షన్ లో సుజాత తో 'కొంతకాలం కొంతకాలం' పాటలో విన్నాను. తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో ఆయన వాయిస్ ని విన్నాను -  కానీ మనవాళ్ళు ఆయన వాయిస్ ని కరెక్ట్ గా వాడుకోలేదని నా అభిప్రాయం. మొన్న రేడియో మిర్చి అవార్డుల కార్యక్రమానికి వెళ్లినప్పుడు స్టేజ్ మీద  ఒక మెడ్లీలో దుమ్ము దులిపేశాడు మధుబాలకృష్ణన్. వెళ్ళి ఆయన గురించి నా అబ్జర్వేషన్ చెప్పగానే అయిదు నిముషాల్లోనే ఎప్పటినుంచో పరిచయం వున్నట్టుగా ఎంతగానో కలిసిపోయాం. జత పరిచిన ఫొటో ఆ క్షణాన తీయించుకుకున్నదే.  

No comments: