Sunday, June 7, 2009

' మల్లన్న ' లో ' మాంబో మానియా ' పాట గురించి ...

ఈ పాట ని విక్రమ్ , రీటా పాడగా మధ్య మధ్య దేవిశ్రీ ప్రసాద్ గొంతు కూడా వినిపిస్తూ వుంటుంది. విక్రమ్ లోని గాయకుడు ఎన్ని పోకడలు పోయాడో చెప్పడానికి ఈ ఒక్క పాట సరిపోతుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది అని చెప్పడానికి ' ఫదేల్ ఫడేల్ ఫడేల్ ' దగ్గిర చూడండి. ఈ పాటకి మోహన రాగం ఆధారం . ఈ రాగం లో రెహమాన్ చేసిన 'మావేలే మావేలే ' (జంటిల్ మన్) , ఇళయరాజా చేసిన 'నిన్ను కోరీ వర్ణం (ఘర్షణ) పాటల్ని గుర్తుచేసుకుంటూ ఈ పాటని విని చూడండి . ఇళయరాజా , రెహమాన్ , దేవిశ్రీ ఈ ముగ్గురూ ఈ రాగాన్ని ఎంత బాగా ప్రయోగించారో తెలుస్తుంది .

No comments: