Thursday, June 11, 2009

' మల్లన్న ' లోని ఈ పాటని ట్రై చేసి చూడండోసారి

' మల్లన్న ' లో హీరో విక్రమ్ , దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన పాటలో 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ ని యూత్ తెగ పాడుకుంటున్నారు.ఈపాటలో మొదటి చరణం విక్రమ్ పాడేడు. మిగతా చరణాలు దేవిశ్రీ పాడేడు. సాహిత్యం ఎదురుగా వుంటేనే ఈ పాటను ఎవరైనా పాడగలరు. లేకపోతే ఎవ్వరూ పాడలేరు. ఎందుకంటే మొదటి చరణం లో రకరకాల చిరు తిళ్ళను పేర్కొంటూ ఇవన్నీ డూప్ - పిజ్జాయే టాప్పు అని అంటాడు విక్రమ్ . అలాగే రెండో చరణం లో రకరకాల బంధుత్వాలను పేర్కొని ఇవన్నీ డూప్ - స్నేహితుడే టాప్పు అని అంటాడు దేవిశ్రీ. ఇక మూడో చరణం లో రకరకాల ఫీలింగ్స్ గురించి చెప్తూ ఇవన్నీ డూప్ - జాలీయే టాప్పు అంటాడు. నాలుగో చరణం లో రకరకాల వ్యక్తులను సంభోధిస్తూ ఇవన్నీ డూప్ (వీళ్ళంతా డూప్ అని వుండాల్సింది) మల్లన్నే టాప్ అని ముగిస్తాడు. ఈ ' రకరకాలను ' ఏరి ఒక చోట కూర్చడం ఎంత కష్టమో ,వాటన్నిటినీ మర్చిపోకుండా గుక్క తిప్పుకోకుండా పాడడం అంతే కష్టం. అంచేతే 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ వుందనిపిస్తుంది. జత పరిచిన వీడియో ని చూడండోసారి .

1 comment:

Phaneendra said...

really a challenging song to sing...