Friday, June 5, 2009

మీరిది గమనించారా ? (రెండు)

పంథొమ్మిది వందల అరవై నాలుగులో 'దాగుడుమూతలు ' అనే సినిమా రిలీజైంది. ఆ సినిమాలో ఓ పాట - 'దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం '. అలాగే పంథొమ్మిది వందల అరవై ఐదులో ' వీరాభిమన్యు ' అనే సినిమా రిలీజైంది. ఇందులోని పాట - ' రంభా ఊర్వశి తలదన్నే ' . ఈ రెండు సినిమాలకీ కేవీ మహదేవనే సంగీత దర్శకుడు.ఈ రెండు పాటలూ హిట్టే. కానీ ఈ రెండు పాటల్లోనూ ఒక లైన్ దగ్గర ట్యూన్ కామన్ గా వుందని ఆ రోజుల్లో కొంతమంది మాత్రమే గ్రహించగలిగారు. కావాలంటే ' దేవుడనే వాడున్నాడా ' పాటలో 'తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ ' అనే లైన్ దగ్గిర ట్యూనూ , ' రంభా ఊర్వశి తలదన్నే ' పాటలో ' తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ' , 'కలికి సరసనా పులకరించీ కరగిపోవని తనువేలా ' అనే లైన్ల దగ్గర ట్యూనూ ఒకేలా వుంటాయి వినడానికి. ఈ ఆర్టికిల్ తో పాటు జత పరిచిన వీడియోని ఓ సారి క్లిక్ చేసి చూడండి. .

No comments: