Sunday, November 22, 2009

రాజా కు అక్కినేని ప్రశంసలు

జీవితాంతం గుర్తుంచుకొదగ్గ సంఘటన ఇటీవల నా జీవితం లో జరిగింది. మా టీవీ లో ఉద్యోగం చేస్తున్నాను కనుక అక్కడ 'గుర్తుకొస్తున్నాయి ' అనే ప్రోగ్రాం గత మూడున్నర సంవత్సరాలుగా చేసేను. 2006 సంవత్సరానికి ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం మొదటి బహుమతినిచ్చి నందీ అవార్డు తో సత్కరించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో కొనసాగించడం జరిగింది.ఆయన జీవితం లోని అన్ని అంశాలను స్పృశిస్తే సుమారు 74 ఎపిసోడ్ లు అయ్యాయి. ఆవన్నీ కలిపి 25 సీడీలు గా విడుదల అయ్యాయి. ఆ సీడీల ఆవిష్కరణ సభలో శ్రీ అక్కినేని నాగెశ్వర రావు గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ,ప్రేక్షకులు గర్వించే ఓ లెజెండ్ నా గురించి మాట్లాడడం, ఎక్నాలెడ్జ్ చెయ్యడం నాకు నందీ అవార్డ్ కన్నా గొప్పగా అనిపించాయి.ఏయన్నార్ గారి ద్వారా ప్రశంసలు అందుకోవడం మాటలు కాదని పరిశ్రమలోని వారందరికీ తెలుసు. ఇన్నాళ్ళుగా నేను పడిన శ్రమకి భగవంతుడు ఈ రూపంలో గుర్తింపునిచ్చాడనిపించింది.నా ఆనందంలో పాలుపంచుంటారిని ఆశిస్తూ ఏయన్నార్ ప్రసంగం లో కొంత భాగాని వీడియోగా జతపరుస్తున్నాను.చూస్తారు కదూ ?