Thursday, December 27, 2012

రెహమాన్ శక్తిశ్రీ తోనే ఎందుకు పాడించాలి ?



మణిరత్నమ్, ఏ.ఆర్. రెహమాన్ ల 'కడలి' సినిమా ఆడియో రిలీజ్ అయ్యింది.
ఇది తమిళం లోని కడల్ కి తెలుగు వెర్షన్.
'కడల్ ' కోసం చేసిన 'నెంజిక్కుళ్ళై' పాటని
ఎమ్ టీవీలో 'రెహమాన్ అన్ ప్లగ్గ్ డ్ ' ప్రోగ్రామ్ ద్వారా
ప్రేక్షక శ్రోతలకు రెహమాన్ కొన్ని నెలల క్రితమే పరిచయం చేశాడు.
అప్పట్నించీ ఈ ట్యూన్ కి విపరీతమైన ఆదరణ.
ఒకానొక దశలో 'కోలావెరి' హిట్స్ ని దాటిపోయిందేమోనన్న
అభిప్రాయం కూడా స్ప్రెడ్ అయ్యింది.
ఆ ట్యూన్ తెలుగు వెర్షన్ లో 'గుంజుకున్నా' అనే పాటగా
'కడలి' ఆడియోలో వుంది. తమిళం లోనూ, అన్ ప్లగ్గ్ డ్ ప్రోగ్రామ్ లోనూ
పాడిన శక్తిశ్రీ గోపాలనే తెలుగు వెర్షన్ (గింజుకున్నాపాట) ని పాడింది.
ఈ తెలుగు వెర్షన్ ని విన్న ఓ సంగీతాభిమాని అంజనా సౌమ్య గాని
శ్రావణ భార్గవి గాని పాడి వుంటే బాగుండేది అని ఓ అభిప్రాయాన్నినాకు పంపారు.
దానికి నా సమాధానం ఇదీ :
(ఆ తెలుగు పాటని విని నా అభిప్రాయం మీద మీ అభిప్రాయం చెప్పండి)
'నెంజిక్కుళ్ళె' తెలుగు వెర్షన్ 'గుంజుకున్నా' పాట మీద మీ అభిప్రాయం చదివాను.
ఏవైనా రెండు ఒక్క లాంటివే వస్తే ప్రేక్షకులు విధిగా మొదటి దాన్నే మెచ్చుకుంటారు.
ఇది కొన్ని తరాలుగా ఋజువవుతోంది.
అంజనా సౌమ్య , శ్రావణ భార్గవి పై మీకు గల అభిమానం 
సద్విమర్శకు అతీతంగా ఆలోచించేలా చేస్తోందనిపిస్తోంది . .
ఈ పాటకి గొంతులో కొంత నాసికా సౌందర్యం తో పాటు
మింగబోతున్న వెన్న ముద్దని కంఠం మధ్యలోనే ఆపి
ఆ మాధుర్యాన్ని పాటకు ఆసాంతం పూయగల సామర్ధ్యం వుండాలి.  
శక్తిశ్రీ గోపాలన్ లో ఆ క్వాలిటీని పట్టుకున్నాడు రెహమాన్.
ఒరిజినల్ పాటని వేరే భాషలోకి తీసుకున్నప్పుడు గాయనీ గాయకుల్ని
మార్చిన సందర్భాలు రెహమాన్ కి వున్నాయి. 
ఈ పాటకి మార్చక పోవడానికి ఆ క్వాలిటీయే కారణం అనుకుంటున్నాను.
రెహమాన్ కి అంజనా సౌమ్య వాయిస్, శ్రావణ భార్గవి వాయిస్ తెలుసు.
వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కరెక్ట్ అనుకున్నా రెహమాన్ ఒదిలి పెట్టడు.
మూల మూలల్నించి గాయనీ గాయకుల్ని వెతికి పట్టుకుని
శ్రోతలకి పరిచయం చేసిన చరిత్ర రెహమాన్ ది.
అంజనా సౌమ్య లో గొంతులో వున్న నాసికా సౌందర్యం ఈ పాటకి
సరిపోతుందేమో గానీ పైన చెప్పిన రెండో క్వాలిటీ లేదు.
ఇక శ్రావణ భార్గవి తన గొంతుని రకరకాలు గా మార్చగలదేమో గానీ
తన ఒరిజినల్ గొంతుతో  ఇన్ని అందాలను పలికించ లేదు.
ఈ పాటకి ఏ భాషలోనైనా - రెహమాన్ ఊహించి పంచిన అనుభూతిని
అందించ గల గాయని శక్తిశ్రీ గోపాలన్ కి వుంది
రెహమాన్ పాటకు అంకితమైన వ్యక్తి.  
వ్యక్తిగత మైన అభిమానాలకు తావివ్వడు.
ఇచ్చే వ్యక్తే అయితే ఇంతమంది సింగర్లను పరిచయం చెయ్యడు.
ఈ పాటకు శక్తిశ్రీ తరువాత కొంతలో కొంత సరిపోయే గొంతు మధుశ్రీ ది.
( యువ లో సంకురాత్రి కోడి పాటను గుర్తు తెచ్చుకోండి)
ఇవన్నీ గాక పూర్తి తెలుగు తనాన్నే కోరుకుంటే
ఈ రకం అందాలన్నిటినీ మర్చిపోతే (గలిస్తే) ,
సరికొత్త అందాలతో పాడగల గాయని 
కేవలం శ్రేయా గోషల్ మాత్రమే.
ఇదీ నా అభిప్ర్రాయం.

3 comments:

srinivas reddy.gopireddy said...

రాజా గారూ,గాయకుల సంగతి సరే ఆ సాహిత్యం ఏంటండి?tune కు సరిపోతే సరి అనుకుని ఏదో ఒక చెత్త కూత తో నింపడం వేటూరి తొ మొదలై అలాగే కొనసాగుతుంది.

sasi said...

Chala baga vivarincharandi.What u said abt Rahman is absolutely correct.He is almost prefect in selecting right kind of singers

Lokesh said...

www.youtube.com/watch?v=TyYyTphc_LI